తేజ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడు గా “అలివేలు వెంకటరమణ ” మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరోయిన్ గా సాయి పల్లవి గానీ , రకుల్ ప్రీత్ ను గానీ ఎంపిక చేయాలని దర్శకుడు తేజ ప్లాన్ చేశారు. సాయి పల్లవి పలు మూవీస్ లో బిజీగా ఉండడంతో రకుల్ ప్రీత్ ను హీరోయిన్ గా ఎంపిక చేయడం బెటర్ అని తేజ భావిస్తున్నట్టు సమాచారం. ఇంతకు ముందు గోపీచంద్, రకుల్ జంటగా రూపొందిన “లౌక్యం “మూవీ ఘనవిజయం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు తేజ దర్శకత్వంలో రూపొందిన “జయం “, “నిజం ” మూవీస్ లో విలన్ గా నటించిన గోపీచంద్ “అలివేలు వెంకటరమణ ” మూవీ లో హీరోగా నటించడం విశేషం. హీరో గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్” మూవీ లో నటిస్తున్నారు. హిందీ మూవీస్ తో బిజీగా ఉన్న రకుల్ ప్రస్తుతం “ఇండియన్ 2″తమిళ మూవీ, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న “చెక్ ” మూవీ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: