మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో “పుష్ప ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో రూపొందుతున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో ఒక నెగటివ్ రోల్ కై సీనియర్ హీరోయిన్ , MLA రోజా ను చిత్ర యూనిట్ సంప్రదిస్తున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ మూవీస్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన రోజా కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. టీవీ షోస్ లో పాల్గొంటున్నారు. “పుష్ప ” మూవీ లో నెగటివ్ షేడ్స్ తో ఉన్న ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ ను దర్శకుడు సుకుమార్ క్రియేట్ చేసినట్టు సమాచారం. రోజా గ్రీన్ సిగ్నల్ ఇస్తే “పుష్ప”మూవీకి ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు . సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న “పుష్ప ” మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: