పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోనే అని ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఏదయినా ఆపత్కాలంలో బాధితులకు సాయమందించేందుకు ఆయన ఎల్లప్పుడూ ముందుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకున్నారు. ఈ మేరకు ఆయన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ (టీఎఫ్డీఏ)కు భారీ విరాళం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వివరాల్లోకి వెళ్తే.. మే 4న తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే జరుపుకోనుంది. టాలీవుడ్ దివంగత దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు జన్మదినం (మే 4) సందర్భంగా.. ప్రతి ఏటా దర్శకుల దినోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఘనంగా నిర్వహించనున్న ఈ వేడుకకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదిక కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఇప్పటికే అగ్ర హీరోలు అందరికి ఆహ్వానాలు కూడా అందాయి.
ఈ క్రమంలో తాజాగా ప్రభాస్కు టీఎఫ్డీఏ ఆహ్వానం అందించింది. ఈ సందర్భంగా ప్రభాస్ టీఎఫ్డీఏకు రూ.35 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు టీఎఫ్డీఏ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. డైరెక్టర్స్ డే వేడుకను ఘనంగా నిర్వహించాలని కోరుతూ ఆయన ఈ భారీ విరాళం ఇచ్చినట్లు అసోసియేషన్ తెలిపింది. కాగా ప్రభాస్ భారీ విరాళం అందించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: