ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా “హాథీ మేరే సాథీ ” అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘అరణ్య’, తమిళ్లో కదన్ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజాగా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు విడుదల కానుందో తెలియజేశారు. రెండు రోజులలో అరణ్య, కదన్ ట్రైలర్ లను రిలీజ్ చేస్తామని.. మూడు రోజుల్లో హాథీ మేరే సాథీ ట్రైలర్ లను రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే ఏ టైమ్ కు రిలీజ్ చేస్తారో మాత్రం చెప్పలేదు.
Yes, you read it right! 2 days to go for the official trailer of 2021’s first trilingual film, Aranya and Kaadan. 3 days to go for the official trailer of Haathi Mere Saathi!
The battle to #SaveTheElephants is going to be an epic experience, only in theatres on 26th March. pic.twitter.com/lSg7Y3cX4D— Rana Daggubati (@RanaDaggubati) March 1, 2021
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఇంకా ఈ సినిమాలో శ్రియ పిల్ గోవింకర్, పులకిత్ సామ్రాట్, జగపతి బాబు, పోసాని, విష్ణు విశాల్, మన్సూర్ అలీ ఖాన్ ముఖ్య పాత్రలలో నటించారు. శాంతాను మొయిత్రా సంగీతం అందించారు. ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో తన జీవితాన్ని ఎక్కువగా అడవికే అంకితం చేసి, అక్కడ నివసించే జంతువులను కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ఉండే బాణదేవ్ పాత్రలో రానా మనకు కనిపించబోతున్నారు. ఇదికాక రానా “విరాటపర్వం” మూవీ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: