సక్సెస్ ఫుల్ సైకలాజికల్ థ్రిల్లర్ “అ !” మూవీ తో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. యాక్షన్ థ్రిల్లర్ “కల్కి ” మూవీ తో ప్రేక్షకులను అలరించారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “క్వీన్ ” మూవీ తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహించారు. ఆ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. వైవిధ్య కథాంశాలతో మూవీస్ రూపొందించే ప్రశాంత్ వర్మ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై ఒక మూవీ ని తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ వల్ల చిత్ర పరిశ్రమ పలు విధాల నష్టపోయింది. మూవీ షూటింగ్స్ నిలిచిపోయి , రిలీజ్ లు ఆగిపోయి , థియేటర్స్ మూతబడి చిత్ర పరిశ్రమకు భారీ నష్టం సంభవించింది. దాదాపు 3 నెలల అనంతరం రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్ కు అనుమతినిచ్చినా షూటింగ్స్ ప్రారంభం కాలేదు. ఈ తరుణంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ కరోనా వైరస్ పై రూపొందిస్తున్న మూవీ షూటింగ్ ను జరుపుకుంటుంది. గత ఐదు రోజులుగా సారథి స్టూడియోస్ లో ప్రశాంత్ వర్మ ఈ మూవీ చిత్రీకరణ జరుపుతున్నారు. టీమ్ అందరికీ కరోనా టెస్ట్ లు జరిపి , టీమ్ కరోనా ఫ్రీ అయిన తరువాత తగు జాగ్రత్తలతో ప్రశాంత్ వర్మ షూటింగ్ ప్రారంభించారని, ఇప్పటి వరకూ 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: