బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి మూవీ తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ తన రెండవ మూవీ ని బాలీవుడ్ లో తెరకెక్కించారు. సినీ వన్ స్టూడియోస్, టి -సిరీస్ బ్యానర్స్ పై షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ ఘనవిజయం సాధించింది.కబీర్ సింగ్ మూవీ 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో షాహిద్ కపూర్ సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చాలా రోజులుగా సందీప్ రెడ్డి వంగ టాలీవుడ్ స్టార్ హీరో మూవీ కి దర్శకత్వం వహిస్తారనే ప్రచారానికి ఇప్పుడు తెరపడింది. సందీప్ తన మూడవ మూవీ ని బాలీవుడ్ లో తెరకెక్కిస్తారని సమాచారం. కబీర్ సింగ్ మూవీ నిర్మాతలే మరో మూవీ సందీప్ తో రూపొందించనున్నారని , క్రైమ్ డ్రామా గా రూపొందనున్న ఈ బాలీవుడ్ మూవీ లో రణధీర్ కపూర్ హీరోగా నటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈమూవీ కి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: