సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇప్పుడు తన నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా పై అంచనాలన ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు వీడియోలు పోస్టర్లు రిలీజ్ చేయగా అన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఒక అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో చిత్రయూనిట్ సడెన్ గా సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమాలో అమితాబ్ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా నుండి అమితాబ్ కు సంబంధించిన పోస్టర్లు వచ్చాయి. ఇప్పుడు ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేశారు. అశ్వత్థామ అనే పాత్రలో అమితాబ్ కనిపించబోతున్నాడు. ఎవరు నువ్వు.. నీకు మరణం అన్నదే లేదా? నువ్వు దేవుడివా? ఎవరు నువ్వు? అని ఓ బాలుడు అడుగుతాడు. నేను ద్వాపర యుగం నుంచీ ఉన్నాను.. గురు ద్రోణాచార్యుడి పుత్రుడను.. అశ్వత్థామను అని అమితాబ్ చెప్పే డైలాగ్ చాలా బాగుంది. వీడియో అయితే అదిరిపోయింది. ఇదిలా ఉండగా ఈ వీడియో పై సాయి ధరమ్ స్పందించి తన సోషల్ మీడియా ద్వారా ఇంట్రెస్టింగ్ కామెండ్ చేశారు. తన ట్విట్టర్ ద్వారా ఈసినిమా కోసం వెయిట్ చేయలేను.. బ్రిలియంట్ నాగ్ అశ్విన్ అంటూ ప్రశంసించారు.
Can’t wait for this one… brilliant 🤩 @nagashwin7 kudos to you and @VyjayanthiFilms 👏🏼👏🏼👏🏼 https://t.co/9uhixM9UgF
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 21, 2024
కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. కమల్ హాసన్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: