మారుతి దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇటీవలే ‘ప్రతిరోజు పండగే’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. నేటి నుండి రెండో షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఈ షెడ్యూల్ లో సీనియర్ నటుడు సత్యరాజ్ కూడా పాల్గొననున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా…అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇదిలా ఉండగా.. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తెరకెక్కించడంలో మారుతి తనకంటూ ఓ ముద్ర వేసుకున్నాడు. అయితే నేను శైలజా అల్లుడు సినిమాతో కాస్త వెనుకబడ్డాడు. ఇక సాయి తేజ్ కూడా చిత్రలహరి సినిమాతో హిట్ అందుకని అటు మాస్ ఆడియెన్స్ ని ఇటు క్లాస్ ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సాయితేజ, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ప్రతి రోజు పండుగే పై భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు మారుతి కెరీర్ కి కూడా ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. మరి చూద్దాం.. ఏం జరుగుతుందో…
[subscribe]
[youtube_video videoid=Vl3XWCyNCSQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: