సాయిపల్లవి… జయాపజయాలకు అతీతంగా తనకంటూ ఓ అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఈ తరం కథానాయిక. స్క్రిప్ట్, క్యారెక్టర్ నచ్చితేనే… సినిమాలకు సంతకం చేసే ఈ డాన్సింగ్ సెన్సేషన్… తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `ఐతే`, `అనుకోకుండా ఒక రోజు`, `ఒక్కడున్నాడు`, `ప్రయాణం`, `సాహసం`, `మనమంతా` వంటి వైవిధ్యభరితమైన చిత్రాల రూపకర్త చంద్రశేఖర్ యేలేటి… తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను యువ కథానాయకుడు నితిన్ కాంబినేషన్లో చేయబోతున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది. కాగా… ఈ సినిమాలో కథానాయికగా నటించేందుకు సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ టాక్. కథ, తన పాత్ర బాగా నచ్చడంతో… సాయిపల్లవి ఈ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోందట. ఈ నెలాఖరులో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
[youtube_video videoid=fnFuV2-QSoA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: