రానా దగ్గుబాటి, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కలిసి ఓ జాయింట్ ప్రొడక్షన్ వెంచర్ ను స్టార్ట్ చేయనున్నట్టు గత మూడేళ్ల క్రితమే చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఈ మూడేళ్లలో దీనిపై ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. కానీ మళ్లీ ఇప్పుడు ఈ వార్త తెరపైకి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం రానా-అక్షయ్ కుమార్ ఈ జాయింట్ ప్రొడక్షన్ వెంచర్ ను త్వరలోనే స్టార్ చేయనున్నట్టు తెలుస్తోంది. మరాఠిలో ఘన విజయం సాధించిన కామెడీ ఫిలిం పోస్టర్ బాయ్స్ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు ఈ సినిమాలో రానా, అక్షయ్ కుమార్ అతిథి పాతల్లో కూడా నటించారు. ఇక ఇదే సినిమాను తెలుగు, హిందీ భాషల్లో వేరు వేరుగా తీయాలని చూస్తున్నారట. తెలుగులో యంగ్ హీరో రాజ్ తరుణ్ ను లీడ్ రోల్ లో తీసుకున్నట్టు తెలుస్తోంది. కొత్త దర్శకుడితో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు సమాచారం.
మరి పోస్టర్ బాయ్స్ ను రీమేక్ చేస్తారా? లేకా వేరే ఏదైనా సినిమాను రీమేక్ చేస్తారా? అన్నది తెలియాలంటే… దీనిపై ఓ క్లారిటీ రావాాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
[youtube_video videoid=20aZHly_zTY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: