సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ , “మెహబూబా “, “గల్లీ రౌడీ “మూవీస్ ఫేమ్ నేహా శెట్టి జంటగా అట్లుంటది మనతోని అనే ఉపశీర్షిక తో తెరకెక్కిన “డీజే టిల్లు” మూవీ ఫిబ్రవరి 12వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దాంతో టీమ్ అంతా ఆనందంగా ఉంది. అయితే హీరోయిన్ కు మాత్రం ఆ ఆనందం మిగలలేదు. ఈ ఆనందాన్ని ఆస్వాదించే లోపే నేహా శెట్టి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. “డీజే టిల్లు” రిలీజ్ అవ్వడానికి రెండు రోజుల ముందు నేహా శెట్టి నానమ్మ మృతి చెందారు . ఈ విషయాన్ని స్వయంగా నేహశెట్టి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
తన అభిమాని తనను వదిలి వెళ్ళిపోయిందనీ , రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచే తన నటన చూసేందుకు నానమ్మ ఎప్పుడూ ముందువరుసలో కూర్చునేదనీ , అలాంటి నానమ్మ ఇప్పుడు తన జీవితంలో సంతోషం లో పాలు పంచుకునేందుకు ఇక లేరని తలచుకుంటే హృదయం చలించిపోతుందనీ , ఐ లవ్ యు, “డిజే టిల్లు” విజయం నీకు అంకితం చేస్తున్నా అంటూ నేహా శెట్టి సోషల్ మీడియా లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: