మే 4న తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే జరుపుకోనుంది. టాలీవుడ్ దివంగత దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు జన్మదినం (మే 4) సందర్భంగా.. ప్రతి ఏటా దర్శకుల దినోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఘనంగా నిర్వహించనున్న ఈ వేడుకకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదిక కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలు అందరికి ఆహ్వానాలు అందుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా విక్టరీ వెంకటేష్ మరియు యువసామ్రాట్ నాగచైతన్య అక్కినేనిలకు టీఎఫ్డీఏ ఆహ్వానం అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మంగళవారం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు దర్శకులు ఈ హీరోలను కలిశారు. ఈ సందర్భంగా డైరెక్టర్స్ డే కార్యక్రమానికి రావలసిందిగా వారిని ఆహ్వానించారు. ఇక దర్శకుల వారి ఆహ్వానాన్ని స్వీకరించిన వెంకటేష్, నాగ చైతన్య తప్పకుండా ఈవెంట్కు హాజరవుతామని హామీనిచ్చారు. కాగా వీరిని కలిసిన వారిలో సాయి రాజేశ్, శైలెష్ కోలనుతో పాటు పలువురు దర్శకులు ఉన్నారు. ఇక వెంకటేష్, నాగ చైతన్యలతో పాటుగా మరికొందరు ప్రముఖులకు కూడా ఈ ఆహ్వానాలు అందాయి.
#TFDA members invited distinguished guests from the industry, Yuvasamrat @chay_akkineni, #RNarayanaMurthy, @iamaadisaikumar & @ItsSumaKanakala‘s family for the “Directors’ Day” Event on May 4th at LB Stadium ✨#NagaChaitanya #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/q1vZ1tFLPV
— Telugu FilmNagar (@telugufilmnagar) April 30, 2024
డైరెక్టర్స్ డే కార్యక్రమానికి ఆహ్వానాలు అందుకున్నవారిలో సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు నారాయణమూర్తి, హీరో ఆది సాయికుమార్, మరియు రాజీవ్ కనకాల-సుమ దంపతులు తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు ఈ ఈవెంట్కు సంబంధించి అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవితో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, తదితర స్టార్ హీరోలు ఇప్పటికే ఆహ్వానం అందుకున్నారు. ప్రభాస్ టీఎఫ్డీఏకు రూ.35 లక్షల విరాళం కూడా అందించారు. ఈ ఈవెంట్కు సంబంధించి బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైనట్లు టీఎఫ్డీఏ ప్రకటించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: