పాన్ ఇండియా స్టార్ గా పేరుతెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో రాామాయణం ఆధారంగా తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది కాబట్టి ఎక్కవ శాతం బాలీవుడ్ నటీనటులే నటిస్తున్నారు. ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. అలాగే బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సీతగా కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడు ఆది పురుష్ సినిమా లిస్ట్ లో చేరిపోయాడు. హిందీ బుల్లితెర నటుడు వత్సల్ శేత్ ఆది పురుష్ టీంతో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా తను.. ఓం రౌత్ ఉన్న ఫొటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. న్యూ బిగినింగ్స్ ఆది పురుష్ అంటూ ట్వీట్ చేశాడు. దీనితో ఆదిపురుష్ లో ఆయన నటిస్తున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది.
New Beginnings #Adipurush 🏹@omraut pic.twitter.com/dHFwHQe9hO
— Vatsal Sheth (@shethvatsal) July 15, 2021
ఇక ఇదిలా ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. ఈసినిమాను 2022 ఆగస్టు 11న విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: