లాక్ డౌన్ నాలుగోసారి కూడా పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో లాగ కాకుండా కొన్ని సడలింపులు చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. షూటింగ్స్ కు కూడా కొన్నిషరతులతో అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ఏపీలో ఇప్పటికే అనుమతులు ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రజలు బయటకొస్తున్న నేపథ్యంలో తాను మాస్క్ పెట్టుకున్న ఫొటో పోస్ట్ చేస్తూ, అందరూ మాస్కులు ధరించాలని హీరో మహేశ్ బాబు సూచించాడు. ఇప్పుడిప్పుడే అన్ని చక్కబడుతున్నాయి.. కాస్త టైం పట్టొచ్చు కానీ తప్పకుండా మామూలు పరిస్థితికి వస్తాం.. కానీ ఇప్పుడు మాత్రం మాస్క్ ధరించడం తప్పనిసరి.. బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి…మనతో పాటు మనచుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడినవాళ్లమవుతాం అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
We are opening up. Slowly, but surely. In a time like this, masks are mandatory. Make it a point to wear a mask every time you step out, that’s least we can do to protect ourselves and others. pic.twitter.com/2ld3xW9ifM
— Mahesh Babu (@urstrulyMahesh) May 22, 2020
ఇక మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వంటి భారీ హిట్ తర్వాత ఇంతవరకు ఏ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. అయితే గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా దాదాపు పూర్తి అయ్యాయని తెలుస్తుంది. త్వరలోనే ప్రకటన ఇస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: