టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడికి పితృవియోగం

Director Trinadha Rao Nakkina's Father Passed Away

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి మృతి చెందారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం కన్నుమూశారు. దీంతో డైరెక్టర్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక ఈ విషయం తెలియడంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు త్రినాధరావు నక్కిన తండ్రి మృతికి సంతాపం తెలుపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే పలువురు నెటిజెన్ల సైతం సోషల్ మీడియా వేదికగా దర్శకుడికి సంతాపం తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా త్రినాధరావు నక్కిన తండ్రి అంత్యక్రియలు బుధవారం వారి స్వస్థలం అనకాపల్లిలో జరుగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో హీరో సందీప్ కిషన్, నిర్మాత రాజేష్ దండా రేపు అనకాపల్లి వెళ్లనున్నారు.

ఇక త్రినాధరావు నక్కిన ‘ప్రియతమా నీవచట కుశలమా’ అనే సినిమాతో తొలిసారిగా డైరెక్టర్‌గా మారాడు. దీని తరువాత ‘మేము వయసుకు వచ్చాం’, ‘నువ్విలా నేనిలా’ అనే సినిమాలు చేశాడు. ఈ క్రమంలో రాజ్ తరుణ్ హీరోగా 2015లో వచ్చిన ‘సినిమా చూపిస్తా మావా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అక్కడినుంచి వరుసగా.. నానితో ‘నేను లోకల్’, రామ్‌తో ‘హలో గురు ప్రేమ కోసమే’, రవితేజతో ‘ధమాకా’ వంటి హిట్ సినిమాలు తీశాడు. కాగా ప్రస్తుతం సందీప్ కిషన్‌తో సినిమా చేస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 17 =