కరోనా మహమ్మారి కారణం గా మూవీ షూటింగ్స్ , రిలీజ్ లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. సాధారణ ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా ఇంటికే పరిమితం అయ్యారు . తెలుగు, తమిళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకూ ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ టైమ్ పాస్ చేసిన రకుల్ రెండు నెలలకు పైగా ఇంటికే పరిమితం అయ్యి బోర్ ఫీల్ అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ గురించి రకుల్ మాట్లాడుతూ .. కరోనా కారణం గా తన జీవితంలో ఎక్కువ కాలం విరామం తీసుకున్నానని, ఈ సంవత్సరం ఎన్నో కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకున్నానని , కరోనా కారణంగా అవన్నీ తారుమారు అయ్యాయని, తాను నటిస్తున్న 3 హిందీ మూవీస్ ఈ సంవత్సరంలోనే రిలీజ్ కావాల్సి ఉందని , కరోనా ప్రభావం తో విడుదల వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయని, పరిస్థితులు పూర్వ స్థితి కి వచ్చి సాధారణ జీవితంలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నానని , సెట్స్ లోకి వెళ్ళడానికి ఆతృతతో ఎదురు చూస్తున్నానని రకుల్ తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: