అనిల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్ లో మొదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. గత కొద్ది రోజులు ఈసినిమా కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. అయితే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈరోజే ముగిసింది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని.. మహేష్ బాబుగారితో వర్క్ చేయడం చాలా గొప్పగా ఉందని ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇక రెండవ షెడ్యూల్ ఈ నెల 26 నుండి హైదరాబాద్ సిటీలో జరగనున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
It’s a wrap for first schedule in Kashmir. It’s a mind blowing experience to work with Super Star @urstrulymahesh garu. Can’t wait to start our 2nd schedule from 26th in hyd.. #SarileruNeekevvaru @RathnaveluDop @iamRashmika @AKentsOfficial @SVC_official pic.twitter.com/YvVQSmewZn
— Anil Ravipudi (@AnilRavipudi) July 19, 2019
కాగా ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. మరి ఈ సినిమాతో మహేష్, అనిల్ రావిపూడి మరో హిట్ కొడతారేమో చూద్దాం..
[youtube_video videoid=zCzNEtv7DzE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: