‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’ ఇలా మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో మరో సినిమాను పట్టాలెక్కించడానికి నితిన్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే సినిమాను తెరకెక్కించనున్నట్టు ఎప్పుడో వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమా టైటిల్ పోస్టర్ కూడా ఎప్పుడో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. కానీ సినిమా మాత్రం ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఎన్నో రోజుల తరువాత నితిన్ ‘భీష్మ’ హడావుడి మొదలైంది. నేడు ఈ సినిమాను లాంచనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. జూన్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ ఏడాది చివరిలో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
కాగా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈసినిమాలో నితిన్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించనుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఆమెకి ఇది రెండవ సినిమా. మరి ఇటీవల సక్సెస్ ను చూడని నితిన్ ఈ సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకంతో వున్నాడు. మరి చూద్దాం ఈ సినిమాతో అయినా నితిన్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో..
[youtube_video videoid=QIam1ccIb6c]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: