మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో హరీష్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. తమిళ చిత్రం ‘జిగర్తండా’కు రీమేక్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ గ్యాంగ్ స్టర్ కామెడీ ఎంటర్టైనర్ను 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… తొలుత ఈ సినిమాకు టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే… కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మెగా ప్రాజెక్ట్ నుంచి డీఎస్పీ తప్పుకున్నట్టు సమాచారం. దీంతో… డీఎస్పీ స్థానంలో మిక్కీ జే మేయర్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గతంలో హరీష్ శంకర్, మిక్కీ జె మేయర్ కాంబినేషన్లో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’(2015) సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే.. వరుణ్ తేజ్ తొలి చిత్రం ముకుంద
(2014)తో పాటు మిస్టర్
(2017)కి కూడా మిక్కీనే స్వరాలు అందించాడు. త్వరలోనే మిక్కీ జే మేయర్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
[subscribe]
[youtube_video videoid=t-SWlHFaFUk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: