ఈ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల విషయంలో దూకుడు పెంచాడు. ఫలితమే… వరుస సినిమాలతో పలకరిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. దాదాపు ఎనిమిది నెలల గ్యాప్ లో ‘కాలా’, ‘2.0’, ‘పేట’తో పలకరించిన సూపర్ స్టార్… ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్న ‘దర్బార్’లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. కాగా… ఈ చిత్రంతో పాటు మరో రెండు ఆసక్తికరమైన సినిమాలకు కూడా రజినీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘ముత్తు’, ‘నరసింహ’ (తమిళంలో ‘పడయప్ప’), ‘లింగ’ చిత్రాల తరువాత కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో మరోసారి జట్టు కట్టనున్నాడట రజినీ. అలాగే… కార్తితో ‘ఖాకి’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన వినోద్ దర్శకత్వంలో కూడా మరో సినిమాను చేయబోతున్నాడట సూపర్ స్టార్. ఇప్పటికే రజినీ అభిమానుల్లో ఈ డబుల్ ధమాకా వార్త ఫుల్ జోష్ ను నింపుతూ ఉండగా… తమ అభిమాన హీరో ఈ రెండు సినిమాలలో దేన్ని ముందుగా ప్రారంభిస్తారోననే ఆసక్తి కూడా నెలకొంది. త్వరలోనే ఈ రెండు చిత్రాలపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
[subscribe]
[youtube_video videoid=9OmNwKei83o]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: