మాస్ ట్రీట్ కు రెడీ అయిన ‘సర్కారు వారి పాట’

Sarkaru Vaari Paata Mass Treat On The Way,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata latest News,Sarkaru Vaari Paata Updates,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Review,Sarkaru Vaari Paata latest Reviews,Sarkaru Vaari Paata Movie First Review Sarkaru Vaari Paata Movie Updates,Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Sarkaru Vaari Paata Movie Updates,Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Sarkaru Vaari Paata Mass Updates, Ma Ma Mahesha Lyric Song Sarkaru Vaari Paata,Ma Ma Mahesha Song From Sarkaru Vaari Paata,Ma Ma Mahesha Song,Ma Ma Mahesha Song Update,Sarkaru Vaari Paata Mass Treat For Fans,Makers Of Sarkaru Vaari paata Ready with Mass Treat For Fans, Sarkaru Vaari paata Team Ready with Mass Treat,Sarkaru Vaari Paata Plan For Mass Treat

ప్రస్తుతం ఎక్కడ చూసినా సర్కారు వారి పాట సందడే కనిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా వారం రోజులు టైం ఉండటంతో చిత్రయూనిట్ కూడా వీలైనంత బజ్ క్రియేట్ చేయడానికి చూస్తుంది. ఈసినిమా నుండి ఏ అప్ డేట్ అది సినిమాపై మరింత క్రేజ్ ను పెంచేస్తుంది. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన దగ్గరనుండి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ వరకూ అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. వేటికవే ఒకదానిని మించి ఒకటి ఉండటంతో ప్రేక్షకులు కూడా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకూ మూడు పాటలను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అందులో మొదటి పాట కళావతి సాంగ్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ తరువాత పెన్నీ సాంగ్ రిలీజ్ చేశారు. ఇక ఈపాటలో మహేష్ కూతురు సితార కనిపించి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. దీంతో ఈపాట కూడా పాపులర్ అయింది. ఆ తరువాత రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మాస్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు చిత్రయూనిట్. ఈసినిమా నుండి మ..మ..మహేషా అనే మాస్ సాంగ్ ను మే 7వ తేదీన ఈపాటను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

పరుశురాం దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. బ్యాంకుల కుంభకోణం నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు అర్థమవుతుంది. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సముద్రఖని కూడా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. ఆర్ మధి సినిమాటోగ్రఫీ, ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =