తమిళ హీరోలు ఇప్పుడు తెలుగులో కూాడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ వారు చేసిన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేస్తూ రిలీజ్ చేసేవారు.. కానీ ఇప్పుడు అందరూ పంథా మార్చారు. స్ట్రైయిట్ తెలుగు సినిమాలే చేయడానికి రెడీ అవుతున్నారు. ముందుగా ధనుష్ అయితే ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. శేఖర్ కమ్ములతో పాటు వెంకీ అట్లూరీతో సినిమాలు చేయనున్నాడు. ఇక మరో స్టార్ హీరో విజయ్ కూడా తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో విజయ్ చేస్తున్నట్టు ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. వీలైనంత త్వరగా ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారట విజయ్-వంశీ కాగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్నిశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ఈసినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు చిత్రయూనిట్ త్వరలో తెలియచేయనున్నారు.
ఇక వంశీ పైడి పల్లి రీసెంట్ సినిమా మహర్షి. ఇందులో రైతుల సమస్యలు, వ్యవసాయం గురించి చెప్పాడు. ఈసినిమాకు గాను జాతీయ అవార్డును సైతం గెలుచుకున్నాడు. మరోవైపు విజయ్ కూడా దాదాపు ఈమధ్య అన్ని సినిమాలు మెసేజ్ ఒరియెంటెడ్ సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కాబట్టి ఎలాంటి నేపథ్యంలో సినిమా వస్తుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: