మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో “మగధీర “, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో “స్టూడెంట్ నెం 1”, “సింహాద్రి “, “యమదొంగ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం ” మూవీ ప్రపంచవ్యాప్తంగా జనవరి 7 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది . దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీ ఎత్తున చేపట్టారు. ముంబై లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్ర యూనిట్ చెన్నై లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అభిమానుల సమక్షం లో గ్రాండ్ గా జరిపింది. తాజాగా కేరళలోని తిరువనంతపురంలో నిన్న “ఆర్ఆర్ఆర్” మలయాళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కేరళ యువ నటుడు టొవినో థామస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రౌద్రం రణం రుధిరం ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కేరళ లో రామ్ చరణ్ మేనియా స్పష్టంగా కనిపించింది నగర వీధుల్లో మెగా అభిమానులు రామ్ చరణ్ పోస్టర్లు ప్రదర్శిస్తూ , కేరళ సంప్రదాయ వాయిద్యాల నడుమ చరణ్ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహిస్తూ “జై చరణ్” నినాదాలతో సందడి చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో “హలో కేరళ” అంటూ రామ్ చరణ్ తన ప్రసంగం ప్రారంభించడం మొదలు అభిమానులు ఈలలు, చప్పట్లతో హోరెత్తించారు.రామ్ చరణ్ మాట్లాడుతూ.. కేరళలో “ఆర్ఆర్ఆర్” ను రిలీజ్ చేస్తున్న నిర్మాత షిబూకు శుభాకాంక్షలనీ , ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్”చిత్రం చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాననీ , నటుడు టొవినో థామస్ కు కృతజ్ఞతలనీ, ఆర్ఆర్ఆర్ చిత్రానికి కేరళ అభిమానుల ఆదరణ కూడా కావాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: