విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తేజ మార్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు , అమృత అయ్యర్ జంటగా రాజమండ్రి బ్యాక్డ్రాప్లో వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన “అర్జున ఫల్గుణ” మూవీ డిసెంబర్ 31న విడుదల కానుంది.నరేష్ , సుబ్బరాజు , శివాజీరాజా ముఖ్య పాత్రలలో నటించారు. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అర్జున ఫల్గుణ” మూవీ విడుదల సందర్భంగా హీరో శ్రీవిష్ణు నిన్న మీడియా తో సమావేశమయ్యారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ .. “అర్జున ఫల్గుణ” మూవీలో ఎన్టీఆర్ అభిమాని గా నటించాననీ , ఇండస్ట్రీ లో ప్రతీ హీరోను గౌరవిస్తాననీ , సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగుతుందనీ , స్నేహంకోసం ఓ మిత్రబృందం చేసిన సాహసం చుట్టూ కథ ప్రధానంగా తిరుగుతుందనీ , నర్సీపట్నంలో జరిగిన యదార్థ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు “అర్జున ఫల్గుణ” మూవీని అద్భుతంగా తెరకెక్కించారనీ , గోదావరి జిల్లాల నేపథ్యంలో పూర్తి స్థాయి చిత్రం చేయాలనే కోరిక ఈ సినిమాతో నెరవేరిందనీ , తన సంభాషణలు కూడా గోదావరి యాసలోనే సాగుతాయనీ , పూర్తి వెటకారంగా ఉంటాయనీ , ప్రస్తుతం “భళా తందనాన”, లక్కీ మీడియాలో పోలీస్ ఆఫీసర్ బయోగ్రఫీతో ఓ చిత్రం చేస్తున్నాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: