యంగ్ హీరో నితిన్, కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా మార్చి 26న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఇదిలా ఉండగా ఈమధ్య కీర్తి సురేష్, నితిన్ తమ సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరోసారి నితిన్ కీర్తి సురేష్ కు సంబంధించి పాత ఫొటోను ఒకటి తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి కామెడీ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
”మిస్సింగ్, కనబడుట లేదు.. డియర్ అను. నువ్వు ఎక్కడ ఉన్నా రంగ్ దే ప్రమోషన్స్లో జాయిన్ అవ్వాలని మా కోరిక.. ఇట్లు నీ అర్జున్” అంటూ రాసుకొచ్చాడు. ఇక విచిత్రం ఏంటంటే నితిన్ ట్వీట్ కు హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించడం. ”ఆందోళన పడకండి నితిన్.. మేము చూసుకుంటాం” అంటూ ఫన్నీగా రీప్లే ఇచ్చారు. సిటీ పోలీసుల పోస్టుకు స్పందిస్తూ.. నితిన్ మరో పోస్టు చేశాడు. నవ్వుతు, నమస్కారాలు పెడుతున్న ఎమోజీలను పోస్టు చేశాడు.
Don’t worry @actor_nithiin we will take care😀
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) March 20, 2021
కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇంకా ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: