ఏడాదికో సినిమా లేదా రెండు మూడు సంవత్సరాలకో సినిమాలో నటించే సూపర్ స్టార్ రజినీకాంత్… 2018లో ‘కాలా’, ‘2.0’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ ఏడాది ‘పేట’తోనే సరిపెట్టిన సూపర్ స్టార్… 2020లో రెండు సినిమాలతో అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నట్టు కోలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘పేట’తో అభిమానులలో జోష్ నింపిన రజినీ… తాజాగా పాన్- ఇండియా డైరెక్టర్ ఎ.ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ‘దర్బార్’లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్… 2020 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.
ఇదిలా ఉంటే… కోలీవుడ్ స్టార్ అజిత్తో ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’, ‘విశ్వాసం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శివ కాంబినేషన్లో ఓ మూవీ చేయబోతున్నట్టు రెండు రోజుల క్రితం రజినీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ను… ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి తీసుకువెళ్ళి… 2020 దీపావళికి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంటే… 2020లో సంక్రాంతి, దీపావళి పండగలకు రజినీ నుంచి రెండు భారీ సినిమాలు వచ్చే అవకాశముందన్నమాట.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: