‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సంపాదించుకున్న ఈ కన్నడ బ్యూటీ… ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్లోనూ హీరోయిన్గా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… శర్వానంద్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ కిషోర్ రెడ్డి దర్శకత్వంలో ‘శ్రీకారం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయిక పాత్రకి ప్రియాంక ఎంపికయింది. ఈ విషయాన్ని ఓ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది ప్రియాంక. ప్రస్తుతం… చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్ స్వరాలు సమకూరుస్తుండగా… 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. కాగా… ఈ క్రేజీ ఎంటర్టైనర్ను 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మరి… తొలి చిత్రంతో మెస్మరైజ్ చేసిన ప్రియాంక… మలి సినిమాతోనూ అలరిస్తుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: