నటసింహ నందమూరి బాలకృష్ణకు కలిసొచ్చిన దర్శకుల్లో యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఒకరు. గతంలో వీరిద్దరి కలయికలో ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కగా… ఇప్పుడు ఈ ద్వయం హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి జట్టుకట్టినట్టు అధికారికంగా ప్రకటించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రాన్ని… ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి (‘జయ జానకి నాయక’ ఫేమ్) నిర్మించనున్నారు. అలాగే… ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ను ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభించి… 2020 వేసవి చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా, ప్రస్తుతం బాలకృష్ణ… కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రూలర్’ (ప్రచారంలో ఉన్న పేరు)లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా… డిసెంబర్ 21న విడుదల కానున్నట్టు ప్రచారం సాగుతోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: