మొత్తానికి అడివి శేష్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే క్షణం, గూఢచారి హిట్ల తో ఫుల్ ఫామ్ లో ఉన్న శేష్ ఇప్పుడు ఎవరు తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆగష్ట్ 15 వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి కల్లెక్షన్స్ తో దూసుకుపోతుంది. పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారు. గతంలో అడవి శేష్ హీరోగా వచ్చిన ‘గూఢచారి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నా..ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో సాధించిన షేర్ రూ. 62 లక్షలు మాత్రమే. అయితే ఈ రికార్డు ‘ఎవరు’ తుడిచిపెట్టేయడమే కాదు… మూడు రెట్లు అధికంగా వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు ఏపీ, తెలంగాణలో రూ. 1.65 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. తొలి రోజు రూ. 1.65 కోట్లు రావడంతో ట్రేడ్ వర్గాలు షాక్ అయ్యాయి. ఇక రెండు రోజుల్లో ఈ సినిమా 2.70 కోట్లు కలెక్ట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నైజాం – 1. 12 కోట్లు
సీడెడ్ – 0.30 కోట్లు
ఈస్ట్ గోదావరి – 0.28 కోట్లు
వెస్ట్ గోదావరి – 0. 13 కోట్లు
ఉత్తరాంద్ర – 0.37 కోట్లు ఇక
గుంటూరు – 0.20 కోట్లు
కృష్ణ – 0.23 కోట్లు
నెల్లూరు – 0.07 కోట్లు
మరి సాహో వరకు రిలీజ్ కు పెద్దగా సినిమాలు లేవు కాబట్టి ఈ పది రోజుల్లో ఎవరు సినిమా కలెక్షన్స్ ఇంకా పుంజుకునే అవకాశం ఉంది. మరి చూద్దాం ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో..
[youtube_video videoid=FcYNvd5r-NE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: