పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై రానటువంటి కథతో ఇది రూపొందుతోందని మేకర్స్ ఇదివరకే స్పష్టం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన సమాచారం కోసం డార్లింగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ నుంచి సాలిడ్ అప్డేట్ అందించింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ను రివీల్ చేసింది. కల్కి 2898 చిత్రంలో ఆయన మహాభారత కాలంనాటి పురాణ పురుషుడు అశ్వత్థాముడి పాత్రను పోషిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం స్పెషల్ గ్లింప్స్ను విడుదల చేసింది మూవీ టీమ్. కాగా పాండవులు, కౌరవులు విద్యనభ్యసించిన గురువు ద్రోణాచార్యుని కుమారుడే ఈ అశ్వత్థామ. భారతీయ ఇతిహాసాలలో పేర్కొనబడిన 7గురు చిరంజీవులలో అశ్వత్థామ ఒకరు కావడం గమనార్హం.
It’s official now… Legendary @SrBachchan as Ashwatthama in @Kalki2898AD 💥💥💥#Kalki2898AD @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms #TeluguFilmNagar pic.twitter.com/YcK0emoczB
— Telugu FilmNagar (@telugufilmnagar) April 21, 2024
ఇక అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ యాక్టర్ ఈ పాత్రను పోషించనుండటంతో దీనిపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. కథ ప్రకారం.. ఈ సినిమా ద్వారయుగంలోని మహాభారత కాలంతో మొదలై క్రీ.శ 2898 ఏడీ సంవత్సరంలో ముగియనుంది. కాగా ఈ సినిమాలో దీపికాతో పాటుగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: