వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై హీరో నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీనివాస్ అవసరాల ప్రధాన తారాగణం గా రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ అ ! మూవీ 2018 వ సంవత్సరంలో రిలీజయి విజయం సాధించింది. సైకలాజికల్ ఇష్యూస్, సోషల్ ప్రోబ్లమ్స్ ఇతివృత్తంతో రూపొందిన అ ! మూవీ 66వ నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ ఎఫెక్ట్స్
బెస్ట్ మేకప్ అవార్డ్స్ గెలుచుకొంది.
ఇప్పుడు అ ! మూవీ సీక్వెల్ రూపొందనుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ .. అ ! మూవీ కి సీక్వెల్ రూపొందించనున్నామని, స్క్రిప్ట్ రెడీ గా ఉందని తెలిపారు. ఈ సీక్వెల్ ఫస్ట్ పార్ట్ కు కంటిన్యూషన్ కాదని, కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుందని, ఫస్ట్ పార్ట్ కొన్ని కథల సమాహారమని, ఈ సీక్వెల్ సింగిల్ స్టోరీ తో నడుస్తుందని, ఒక క్రేజీ ప్రయోగ చిత్రమని అన్నారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను సంప్రదించామని, స్టోరీ కి ఇంప్రెస్ అయ్యారని, ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని, ఈ సీక్వెల్ లో ఎక్కువమంది ఆర్టిస్ట్ లు ఉండరని, మల్టీ లాంగ్వేజస్ లో రిలీజ్ కు ప్లాన్ చేశామని, విజయ్ సేతుపతి ని కూడా సంప్రదించనున్నామని ప్రశాంత్ వర్మ తెలిపారు.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.