మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’… ఈ నెల 24తో షూటింగ్ పార్టును పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోయే తన తదుపరి ప్రాజెక్ట్పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు చిరు. ఇప్పటికే చిరు కోసం ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ను ఫుల్ బౌండ్ స్క్రిప్ట్తో పాటు డైలాగ్ వెర్షన్తో సహా సిద్ధం చేసాడట కొరటాల. చిరు డ్యూయల్ రోల్లో దర్శనమివ్వనున్న ఈ చిత్రంలో… ఒకటి రైతు పాత్ర కాగా, మరొకటి ఎన్నారై పాత్ర అని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా… ఆగస్టు 22న ప్రారంభం కానుందనీ, అలాగే సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని టాక్. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులలో భాగంగా… ‘రంగస్థలం’ సినిమా కోసం తీర్చిదిద్దిన విలేజ్ సెట్ ప్రదేశం పక్కనే ఖాళీగా ఉన్న స్థలంలో రెండు మూడు ఇళ్ల భారీ సెట్ నిర్మాణం కూడా చేపట్టనట్టు సమాచారం. అంతేకాదు ఇక్కడే తొలి షెడ్యూల్ను చిత్రీకరించనున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ఫుల్ క్లారిటీ రానుంది. కాగా… ఈ చిత్రాన్ని 2020 ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
[youtube_video videoid=Q0WrJ6epCl4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: