కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినా భలే గమ్మత్తుగానూ, ఆసక్తికరంగానూ అనిపిస్తాయి. అలాంటి ఆసక్తికరమైన విషయమే… సీనియర్ హీరో రాజశేఖర్, యంగ్ హీరో ఆది విషయంలో రెండేళ్ళ క్రితం జరిగింది, మళ్ళీ ఇప్పుడు చోటు చేసుకుంటోంది. ఆ వివరాల్లోకి వెళితే… 2017 నవంబర్ 3న సీనియర్ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన ‘పి.ఎస్.వి గరుడవేగ 126.18M’ చిత్రం విడుదలైంది. అదే రోజున యువ కథానాయకుడు ఆది సాయికుమార్ నటించిన ‘నెక్స్ట్ నువ్వే’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ రెండు సినిమాల తరువాత ఈ ఇద్దరు హీరోల నుంచి 2018లో ఒక్క సినిమా కూడా తెరపైకి రాలేదు. కట్ చేస్తే… 2019లో మళ్ళీ ఒకే రోజున ఈ ఇద్దరు హీరోలు తమ తమ కొత్త చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ చిత్రాలే రాజశేఖర్ నటించిన ‘కల్కి’, ఆది నటించిన ‘బుర్రకథ’. ఈ రెండు సినిమాలు జూన్ 28న థియేటర్లలోకి రానున్నాయి. గత సందర్భంలో రాజశేఖర్కి మాత్రమే విజయం దక్కింది. మరి ఈ సారి… ఇద్దరికీ విజయాలు దక్కుతాయేమో చూడాలి. అన్నట్టు… రాజశేఖర్ నటించిన పలు చిత్రాలకు ఆది తండ్రి, నటుడు సాయికుమార్ డబ్బింగ్ చెప్పారు. వాటిలో పలు ఘనవిజయాలున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
[youtube_video videoid=d-XXlkh6x18]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: