‘సఖి’… క్లాస్ డైరెక్టర్ మణిరత్నం రూపకల్పనలో తెరకెక్కిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్. మాధవన్, షాలిని జంటగా నటించిన ఈ తమిళ అనువాద చిత్రం… 2000లో విడుదలై మ్యూజికల్ హిట్గా నిలచింది. కట్ చేస్తే… ఇప్పుడు అదే టైటిల్తో తెలుగునాట మరో చిత్రం రాబోతున్నట్టు టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… గత ఏడాది ‘మహానటి’గా తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన కీర్తి సురేష్… ప్రస్తుతం మరో ఫీమేల్ సెంట్రిక్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నరేంద్ర దర్శకత్వంలో నా నువ్వే
, 118
చిత్రాల నిర్మాత మహేష్ కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం… ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. మహిళలపై జరిగే అకృత్యాల నేపథ్యంలో సాగే చిత్రమిదని.. కుటుంబ బంధాలకూ ఇందులో స్థానముంటుందని సమాచారం.
కాగా… కథ రీత్యా ఈ సినిమాకు ‘సఖి’ అనే టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తోందట. త్వరలోనే ఈ టైటిల్పై క్లారిటీ వస్తుంది. ‘మహానటి’లో సావిత్రిగా ఆకట్టుకున్న కీర్తి సురేష్… ఈ ఫీమేల్ సెంట్రిక్ మూవీతో మరోసారి మెస్మరైజ్ చేస్తుందేమో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=fQhu517vBRw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: