విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. పాయల్ రాజ్పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ను కె.ఎస్.రవీంద్ర (బాబీ) రూపొందిస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం… తాజాగా హైదరాబాద్లో రెండో షెడ్యూల్ను పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… ఇందులో చైతు ఆర్మీ ఆఫీసర్గా దర్శనమివ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… తదుపరి షెడ్యూల్ను కాశ్మీర్ బోర్డర్లో ప్లాన్ చేసింది యూనిట్. ఇందులో భాగంగా… కాశ్మీర్లో భారత్ సరిహద్దుల లొకేషన్స్ను ఎంపిక చేసే పనిలో చిత్ర బృందం ఉందట. చైతుకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా… దసరా కానుకగా ‘వెంకీమామ’ విడుదల కానుందని ప్రచారం సాగుతోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: