మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం `చిత్రలహరి`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. `నేను శైలజ` ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్… సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
ఇదిలా ఉంటే… `చిత్రలహరి` తరువాత యూత్ఫుల్ సినిమాల స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ నటించనున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే… ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ ప్రాజెక్ట్ని నిర్మించబోతోందని టాక్. అంతేకాదు… ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఇంకా చెప్పాలంటే… `అభిలాష` చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి పోషించిన చెట్టుకింద ప్లీడర్ తరహా పాత్ర ఇదని తెలుస్తోంది. అలాగే… పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఈ సినిమా ఉంటుందని ఫిల్మ్నగర్ వర్గాల ఇన్ఫర్మేషన్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశముంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=03Mk3HEzRdM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: