నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మితమౌతున్న చిత్రం ఆగిపోయింది అన్న వార్త ఒకటి మీడియాలో వైరల్ కావటం పట్ల చిత్ర నిర్మాత సీ. కళ్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్ని వెబ్ సైట్స్ తో పాటు కొన్ని ప్రముఖ టీవీ ఛానల్స్ లో ఈ సినిమా ఆగిపోయింది అన్న వార్త ఒకటి నిన్నటి నుండి ప్రముఖంగా ప్రచారమవుతుంది. ఈ సినిమా ఆగిపోవడానికి గల కారణాలను కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తూ మీడియాలో వచ్చిన కథనాలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని విలన్ గా చిత్రీకరిస్తూ కథను రూపొందించారనీ అయితే ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయి జగన్ ముఖ్యమంత్రి కావటంతో బాలకృష్ణ ఆ కథ చేయటానికి నిరాకరించారని అందుకే ఆ సినిమా ఆగిపోయిందని కథనాలు అల్లుతూ వార్తను ప్రచారం చేశాయి కొన్ని మీడియా సంస్థలు. కాగా ఈ వార్తలోని నిజానిజాలను నిర్ధారించుకునే నిమిత్తం నిర్మాత సి.కళ్యాణ్ కు ఫోన్ చేసింది ‘తెలుగు ఫిలిం డాట్ కాం’. “మీ సినిమా ఆగిపోయిందనీ, ఈ కారణంగా బాలకృష్ణ గారు మీ సినిమా చేయను అన్నారు అనే వార్తలోని నిజానిజాలు ఏమిటి? అని సి. కళ్యాణ్ ను అడగ్గా “మీడియా ఇలాంటి నిరాధారమైన వార్తలు రాయటం బాధగా అనిపిస్తుంది. ఎవరో ఊరు పేరు లేని websites వాళ్లు ఇలాంటి బేస్ లెస్ న్యూస్ రాస్తే వాటిని చూసి ప్రముఖ ఛానల్స్ కూడా కథనాలు రాయటం ఏమిటి? ఏది ఏమైనా మా సినిమా ఆగిపోయింది అన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. అసలు ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పోలిన పాత్రే లేదు. ఇందులో హీరోది ఒక డాన్ పాత్ర. అతనికి ఒక బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అసలు ఇందులో రాజకీయాల ప్రసక్తే ఉండదు.
సో…బాలకృష్ణ గారు ఆ పాత్ర చేయననటం, సినిమా ఆగిపోవటం ఇదంతా ట్రాష్ అండ్ నాన్సెన్స్. త్వరలోనే మా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తాం” అని వివరణ ఇచ్చారు సి.కళ్యాణ్. సో…ఇవీ ఈ నిరాధార వార్తలోని నిజానిజాలు.
[subscribe]
[youtube_video videoid=ynUjuBYuKIY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: