వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా మహర్షి. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంత చేసుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్ల పరంగా కూడా ఎలాంటి ఢోకా లేకుండా దూసుకుపోతుంది. వినోదం, సందేశాత్మకంగా తీసిన ఈ సినిమా అందరికీ నచ్చేసింది. ముఖ్యంగా రైతుల గురించి.. వారి గొప్పతనం గురించి చెప్పిన విధానం ఆకట్టుకుంది. ఇక చిత్రయూనిట్ కూడా రైతులతో పలు ముఖా ముఖి ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మహేష్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కంట్రీ వైడ్ గా కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అది నిజమైంది. మహర్షి సినిమాను పంజాబ్ లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. గతంలో భరత్ అనే నేను సినిమాను అక్కడ డబ్ చేసి రిలీజ్ చేయగా అది మంచి విజయం సాధించింది. దీంతో ఇప్పుడు మహర్షి సినిమాను కూడా డబ్ చేసి అక్కడ రిలీజ్ చేయనున్నారు.
కాగా ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ నటించగా.. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను దిల్ రాజు – సి.అశ్విని దత్ – పివిపి సంయుక్తంగా నిర్మించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
[subscribe]
[youtube_video videoid=B9_AnB9WRZw ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: