సాయి ధరమ్ తేజ్,సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం విరూపాక్ష.గత వారం విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబడుతుంది.మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో కార్తీక్ దండు ఈసినిమాను తెరకెక్కించాడు. ఈసినిమాకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే తోపాటు నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా గురించి కార్తీక్ దండు రీసెంట్ ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.భమ్ బోలేనాథ్ తో డైరెక్ట్ గా మారాను కానీ ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వలేదు. దాంతో విరూపాక్ష కథ రెడీ చేసుకున్నాను. సుకుమార్ దగ్గరికి వెళ్లి స్టోరీ వినిపించాను ఆయనకు బాగా నచ్చడంతో సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తానని అన్నారు.అలా కొన్ని సిట్టింగ్స్ జరిగాయి ఆతరువాత ఆయన కూడా ఈప్రాజెక్ట్ లోకి ఒక నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు అలా ఈసినిమా కోసం నేను ఆయన దగ్గర పనిచేసాను అంతే కానీ ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఏ సినిమాకి పని చేయలేదు.
ఇక క్లైమాక్స్ ఐడియా కూడా సుకుమార్ గారిదే.అది చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది.సుకుమార్ దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను అని అన్నారు.అలాగే కార్తికేయ ఐడియా కూడా నాదే ఆ తరువాత డైరెక్టర్ చందూ మొండేటి దాన్ని చాలా బాగా డెవ్ లప్ చేసుకున్నాడు అని కార్తీక్ దండు తెలిపారు. విరూపాక్ష చూసి రవితేజ,కళ్యాణ్ రామ్ అభినందించారని చెప్పుకొచ్చాడు. విరూపాక్ష బ్లాక్ బాస్టర్ విజయం దిశగా దూసుకుపోతుండడంతో కార్తీక్ దండుకి టాప్ బ్యానర్ల నుండి ఆఫర్లు వస్తున్నాయట.అయితే తన నెక్స్ట్ మూవీ కూడా థ్రిల్లర్ జోనర్ లోనే చేయాలనుకుంటున్నాడట.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: