విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ ’24’ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న సంగతి తెలిసిందే. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో విక్రమ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే దానికి తగ్గట్టు సూర్య నటన రెండూ హైలెట్ గా నిలిచాయి. 2డి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈసినిమాలో సమంత , నిత్యామీనన్ ఫీమేల్ లీడ్స్ లో నటించారు. ఇక ఇదిలా ఉండగా సీక్వెల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనిపై విక్రమ్ కుమార్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం విక్రమ్ తను తెరకెక్కించిన థాంక్యూ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్రమ్ కుమార్ 24 మూవీ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకి సీక్వెల్ అయితే ఉందని ప్రస్తుతానికి కొంత మేర స్క్రిప్ట్ వర్క్ చేశా.. ఇంకా కథను డెవలప్ చెయ్యాల్సి ఉందని తెలిపారు. అలాగే సూర్య చేసిన పవర్ ఫుల్ రోల్ ఆత్రేయ పై ఇంకా వర్క్ చెయ్యాల్సి ఉందని తాను తెలిపారు. మరి సైన్స్ ఫిక్షన్ సినిమా కాబట్టి.. అందులోనూ సీక్వెన్స్ కాబట్టి కథను ఇంకా ఆసక్తిగా చూపించాల్సి ఉంటుంది. మరి కథ మొత్తం రెడీ అయి ఈసీక్వెల్ సెట్స్ పైకి రావాలంటే మాత్రం కనీసం రెండు మూడేళ్లు పట్టే అవకాశం ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: