టాలీవుడ్ లో హీరోల పంథా పూర్తిగా మార్చేశారు. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు చేయడానికి కూడా ముందుకొస్తున్నారు. ఇక ఇప్పుడు అల్లరి నరేష్ కూడా తన రూటు మార్చేశాడు. ఒకప్పుడు కామెడీ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. చాలా కాలం సరైన హిట్ లేక బాధపడుతున్న అల్లరి నరేష్ మహేష్ మహర్షి సినిమాలో మంచి రోల్ చేసి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ తరువాత నాంది లాంటి సినిమాలో ఛాలెంజింగ్ రోల్ లో చేసి మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజ్మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా టైటిల్ను గత నెలలోనే మేకర్స్ విడుదల చేశారు. తాజాగా ఈసినిమా ఫస్ట్లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో నరేష్ మంచం కాలు పట్టుకుని ఎవర్నో కోల్పోయినట్టు బాధతో చూస్తున్నట్లు ఉంది. పోస్టర్ చూస్తుంటే మరో సీరియస్ కథతోనే నరేష్ వస్తున్నట్టు అర్థమవుతుంది.
ONE Life for his people! ❤️
Here’s the Striking First look Poster of @allarinaresh‘s #ItluMaredumilliPrajaneekam 🔥
Coming soon to Cinemas! #IMPFirstLook #IMP 💥@anandhiactress @raajmohan73 @HasyaMovies @RajeshDanda_ @lemonsprasad @_balajigutta @SricharanPakala pic.twitter.com/uWvWpJrg79
— Zee Studios (@ZeeStudios_) May 10, 2022
కాగా ఆనంది ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండ ఈసినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: