రౌడీ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నాడు. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా తరువాత విజయ్ వెంటనే పూరీతోనే మరో సినిమాను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. పూరీ ఎప్పటినుండో అనుకుంటున్న జనగణమన సినిమానే విజయ్ తో చేయనున్నాడు. ఈసినిమా కోసం ఇప్పటికే తన మేకోవర్ ను కూడా మార్చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఒకవైపు పూరీ సినిమా లైన్ లో ఉండగానే మరో సినిమాను స్టార్ట్ చేసేశాడు విజయ్. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ సినిమా వస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక నేడు ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. లాంచింగ్ కార్యక్రమాలను హైదరాబాద్లో ఘనంగా జరిపారు. ఇక ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు కొరటాల శివ, హరీష్ శంకర్, బుచ్చిబాబు, బాబీలు ముఖ్య అతిథిలుగా వచ్చారు. బుచ్చిబాబు కెమెరా స్విచ్ఛాన్ చేయగా హరీష్శంకర్ క్లాపింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ చిత్రంలో విజయ్కు జోడీగా సమంత హీరోయిన్గా నటించనుండగా వెన్నెల కిషోర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే వీరిద్దరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. ఈసందర్భంగా విజయ్ తన ట్విట్టర్ లో పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటో పోస్ట్ చేస్తూ అందులో సమంత, వెన్నెల కిషోర్ ఫొటోలను కూడా గ్రాఫిక్స్ ద్వారా యాడ్ చేసి ఇది అసలైన ఫొటో అని క్యాప్షన్ ఇచ్చాడు. అంతేకాదు ఈ ఫొటోను పోస్ట్ చేయాలని ప్రెస్ ను కూడా కోరాడు విజయ్. మొత్తానికి డిఫరెంట్ గా ఆలోచించే విజయ్ ఈ విషయంలో కూడా కొత్తగా ఆలోచించాడు.
The Actual Pooja photo! With the darlings @Samanthaprabhu2 @vennelakishore @eyrahul
Request the press to share the actual photo 🙂 thank you. pic.twitter.com/Fz3bfVCIK2
— Vijay Deverakonda (@TheDeverakonda) April 21, 2022
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: