2022 లో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయిపోయాయి. ఇక వాటిలో ఎప్పటినుండో ఎదురుచూస్తున్న మరో సినిమా ఆచార్య. మెగా అభిమానులు మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమాలో చిరు, చరణ్లు మొదటిసారి పూర్తిసాయిలో స్క్రీన్ షేర్ చేసుకుంటుండడంతో ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈనెల 29వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రబృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు దీనిపై మేకర్స్ కూడా క్లారిటీ ఇచ్చారు. తమ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందిస్తున్నట్టు అధికారికంగా తెలియచేశారు. ఈ సందర్భంగా మహేష్ కు చిరంజీవి ఇంకా రామ్ చరణ్ కూడా థ్యాంక్స్ తెలియచేశారు. ఈసినిమాలో భాగమైనందుకు చాాలా థ్యాంక్స్.. నాకు చరణ్ ను నచ్చినట్టే.. ఫ్యాన్స్ ఇంకా ఆడియన్స్ నీ వాయిస్ విని థ్రిల్ అవుతారు అంటూ చిరు తన ట్వీట్ లో పేర్కొన్నాడు. థ్యాంక్స్ మహేష్.. ఆచార్య సినిమాను ఇంకా స్పెషల్ చేశావు నువ్వు నాకు.. బిగ్ స్క్రీన్ పై ఆడియన్స్ ఎప్పుడు ఎక్స్ పీరియన్స్ చేస్తారో వెయిట్ చేయలేకపోతున్నా అంటూ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు.
Thank you @urstrulyMahesh 🤗
You made #Acharya even more special to me !!
Can’t wait for the audience to experience it on Big Screens.#AcharyaOnApr29 https://t.co/S1qj3XEDtk— Ram Charan (@AlwaysRamCharan) April 22, 2022
కాగా మహేష్ బాబు గతంలో పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జల్సా’ సినిమాకి తొలిసారి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత నాలుగైదు చిత్రాలకు కూడా వాయిస్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు ‘ఆచార్య’కు ఇస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: