కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ జంటగా రూపొందిన “భరత్ అనే నేను “మూవీ ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీ లో కియారా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి “హిందీ రీమేక్ “కబీర్ సింగ్ “మూవీ లో కియారా కథానాయికగా నటించారు. “కబీర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించడం తో కియారా బాలీవుడ్ లో బిజీగా మారారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కియారా అద్వానీ ప్రస్తుతం “షేర్ షా “, “భూల్ భులయ్యా 2”, “జుగ్ జగ్ జియో ” బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. కియారా తన రెండవ తెలుగు మూవీ “వినయ విధేయ రామ “లో హీరో రామ్ చరణ్ కు జంటగా నటించారు. ఆ మూవీ ప్రజాదరణ పొందలేదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ మూవీస్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక మూవీ రూపొందనున్న విషయంతెలిసిందే . ఆ మూవీ లో కియారా , మరో సారి హీరో రామ్ చరణ్ కు జోడీగా నటించనున్నారని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: