జీహెచ్ ఎంసీ కార్మికులపై ‘దిల్’ చూపించిన రాజు..!

Ace Producer Dil Raju Distributes Safety Masks and Hand Sanitizers For GHMC Workers
Ace Producer Dil Raju Distributes Safety Masks and Hand Sanitizers For GHMC Workers

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఇక ఈ లాక్ డౌన్ వల్ల పేదలకు, రోజువారీ కూలీలకు ఆర్థికంగా.. తినడానికి కూడా ఇబ్బందులు ఎదరువుతున్నాయి. ఇక వారికీ సాయం చేయడానికి పలువురు ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు తమంతటతాముగా ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షల చొప్పును ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళం అందించారు. ఇప్పుడు తాజాగా ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్స్ , మాస్క్ లు పంపిణీ చేసారు. ఆయ‌న‌తో పాటు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఇక ఈ విషయాన్ని మేయర్ తమ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ… దిల్ రాజు పై ప్రశంసలు కురిపించారు.

కాగా ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా నాని హీరోగా ‘వి’ సినిమా తెరకెక్కించాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా ‘వకీల్‌ సాబ్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంకా అల్లు అర్జున్ హీరో గా ఐకాన్ సినిమాను కూడా తెరకెక్కించనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − two =