శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉండగా.. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ చిన్నగా ప్రమోషన్ మొదలుపెట్టేసింది ఫిలిం యూనిట్. రిలీజ్ చేసిన పోస్టర్స్, నాగచైతన్య ఫస్ట్ గ్లింప్స్, ‘ఏ పిల్లా సాంగ్’ పాట ఇలా అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత చై ఏం సినిమా చేయబోతున్నాడా అన్న దానిపై పలు వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. నిజానికి ‘లవ్ స్టోరీ’ సినిమా తరువాత ఆయన పరశురామ్ దర్శకత్వంలో ‘నాగేశ్వరరావ్’ చేయవలసి వుంది. కానీ పరశురామ్ .. మహేశ్ బాబు ప్రాజెక్టుపైకి వెళ్లడంతో, ‘నాగేశ్వరరావ్’ సెట్స్ పైకి వెళ్లడానికి టైం పట్టేలా ఉంది.
అయితే ఈ గ్యాప్ లో చైతు విక్రమ్ కుమార్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే మధ్యలో పరుశురాం వచ్చాడు. ఇక ఇప్పుడు విక్రమ్ కుమార్ చైతు కి కథ చెప్పగా… చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేది తాజా సమాచారం. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు…మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: