2020 సంవత్సరం సంక్రాంతి పండుగ నలుగురు స్టార్ హీరోల మూవీస్ రిలీజ్ లతో సందడిగా మారనుంది. తెలుగు వారి అతి పెద్ద పండుగ సంక్రాంతి. పండుగ సీజన్ లో వసూళ్ళు అధికంగా ఉంటాయని నిర్మాతలు తమ మూవీస్ ను సంక్రాంతి పండుగ కు రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతారు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో, రజనీకాంత్ దర్బార్, బాలకృష్ణ , KS రవికుమార్ కాంబినేషన్ మూవీ సంక్రాంతి బరిలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహర్షి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత మహేష్ బాబు నటించిన మూవీ , గత సంక్రాంతికి F 2 మూవీ తో ఘనవిజయం సొంతం చేసుకొన్న దర్శకుడు అనిల్ రావిపూడి, 13 సంవత్సరాల తరువాత లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. హిట్ కాంబినేషన్ తో పాటు, సంవత్సరం పైగా గ్యాప్ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠ పురంలో మూవీ కై అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. హీరో బాలకృష్ణ, KS రవికుమార్ కాంబినేషన్ లో రూపొందిన జైసింహా మూవీ 2018 సంవత్సరం సంక్రాంతికి రిలీజయి విజయం సాధించిన విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఒక మూవీ శరవేగంగా రూపుదిద్దుకొంటుంది. ఆ మూవీ కూడా సంక్రాంతి బరిలో ఉంది. ఇక తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ AR మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న దర్బార్ మూవీ లో రజనీకాంత్ చాలా సంవత్సరాల తరువాత పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం. తమిళ్ లోనే కాకుండా తెలుగు లో కూడా రజనీకాంత్ మూవీస్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: