క్షణం, అమీ తుమీ, గూఢచారి సినిమాల హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న టాలెంటెడ్ హీరో అడివి శేష్. సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో తాను ప్రధాన పాత్రలో ‘ఎవరు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను మాత్రం చాలా సీక్రెట్ గా పూర్తి చేశాడు. మొదట ఈ సినిమాను ఆగష్ట్ 23వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తరువాత ఆగష్ట్ 15వ తేదీకి మార్చారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. తాజాగా టీజర్ రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. జులై 19వ తేదీన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Guys n Gals! The #Evaru Teaser will be unveiled on #Friday #July19th ! Can’t wait for you to see this one! #EvaruTeaser
— Adivi Sesh (@AdiviSesh) July 17, 2019
ఇంకా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో శేష్ సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, మురళి శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీవీపీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. కాగా వీటితో పాటు అడివి శేష్ చేతిలో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో గత ఏడాది తనకు మంచి సక్సెస్ ఇచ్చిన గూడచారి సీక్వెల్ కాగా మరొకటి మహేష్ బాబు, సోనీ సంస్థల సంయుక్తంగా నిర్మించనున్న మేజర్.
[youtube_video videoid=CQ_7dQbA-HY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: