దాదాపు ఆరు దశాబ్దాల అవిశ్రాంత సినీ ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించి జూన్ 27వ తేదీన తనువు చాలించిన సుప్రసిద్ధ నటీమణీ, దర్శకురాలు శ్రీమతి విజయ నిర్మల దశదిన సంస్మరణ కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాధారణంగా దశదిన కర్మ రోజున దివంగత వ్యక్తుల చిత్రపటం ముందు దీపం వెలిగించి, పూలు చల్లి
శ్రద్ధాంజలి ఘటిస్తారు. కానీ ఈరోజు జరిగిన విజయనిర్మల దశదిన సంస్మరణ కార్యక్రమంలో శ్రద్ధాంజలి ఘటించటంతో పాటు ప్రముఖులను వేదికపైకి పిలిచి మాట్లాడవలసిందిగా కోరటంతో అందరూ అశ్రు నయనాలతో విజయనిర్మలతో తమకుగల అనుబంధాన్ని, చిత్ర పరిశ్రమలో ఆమెకుగల స్థాన విశిష్టతను గురించి మాట్లాడారు.
ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంస్కరణ కార్యక్రమంలో తొలుత
తొలి సినీ నేపథ్యగాయకురాలు, విజయనిర్మల మేనత్త అయిన శ్రీమతి రావు బాలసరస్వతి విజయనిర్మల చిత్రపటం ముందు దీపం వెలిగించారు. ఆ తరువాత భర్త సూపర్ స్టార్ కృష్ణ, హీరో బాలకృష్ణ, మురళీమోహన్, ఆర్ నారాయణ మూర్తి, జయసుధ, రమా ప్రభ, ప్రభ, గీతాంజలి, రాజకీయ ప్రముఖులు టీ.సుబ్బరామి రెడ్డి గల్లా అరుణకుమారి, గల్లా జయదేవ్, రఘువీరారెడ్డి, బుద్ధ వెంకన్న తదితరులు విజయనిర్మల తో గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రసంగించారు.
చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్త శాఖల ప్రతినిధులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్స్, నటీనటులు, అభిమానులు, పాత్రికేయులు వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీమతి విజయ నిర్మల ఆత్మ శాంతి ని ఆకాంక్షిస్తూ ఘన నివాళి అర్పించారు.
[youtube_video videoid=L1dTlX0bsh8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: