‘శతమానం భవతి’, ‘శ్రీనివాస కళ్యాణం’ లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలను తెరకెక్కించిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతున్నట్టు గత కొద్దిరోలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చేందుకు గాను ఈ మూవీ ని అధికారికంగా నేడు చిత్ర యూనిట్ ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో కళ్యాణ్ రామ్ సరసన ‘ఎఫ్2’ బ్యూటీ మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ రంగంలో అగ్రగామి ఉన్న ఆదిత్య మ్యూజిక్ మొదటిసారిగా ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి స్వరాలు గోపి సుందర్ సమకూరుస్తున్నారు.
[youtube_video videoid=5WbPq3qjJHE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: